కొత్తగా 16 విమానాశ్రయాలు...కేంద్రమంత్రి వెల్లడి
ABN, First Publish Date - 2022-02-01T13:26:04+05:30
ఐదు మధ్య భారత రాష్ట్రాల్లో కొత్తగా 16 విమానాశ్రయాలను నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు...
న్యూఢిల్లీ : ఐదు మధ్య భారత రాష్ట్రాల్లో కొత్తగా 16 విమానాశ్రయాలను నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.ప్రధానమంత్రి-గతి శక్తి పథకం విజయవంతం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని జ్యోతిరాదిత్య చెప్పారు.మధ్యప్రదేశ్లోని రేవా, ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్, బిలాస్పూర్, జగదల్పూర్,ఉత్తరప్రదేశ్లో తొమ్మిది విమానాశ్రయాలు,రాజస్థాన్లో ఒక విమానాశ్రయం నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 100 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పీఎం గతి శక్తి ప్రాజెక్టు భారతదేశాన్ని ప్రపంచ సూపర్ పవర్గా మారుస్తుందని సింధియా నొక్కిచెప్పారు.ఈ పథకం బహుళ-మోడల్ కనెక్టివిటీ, ఆర్థిక మండలాలు, పారిశ్రామిక జోన్లు, వ్యవసాయ జోన్లు, కార్గో జోన్లు, స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు.
Updated Date - 2022-02-01T13:26:04+05:30 IST