ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీ

ABN, First Publish Date - 2022-04-03T13:01:25+05:30

తరగతి గదిలో లభించిన రూ.50 నోటును ఉపాధ్యాయురాలికి అందజేసిన ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీని ప్రశంసిస్తూ ఉపాధ్యాయులు ఆ చిన్నారిని ఒకరోజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                 - ఒకరోజు హెచ్‌ఎంగా గౌరవించిన ఉపాధ్యాయులు


పెరంబూర్‌(చెన్నై): తరగతి గదిలో లభించిన రూ.50 నోటును ఉపాధ్యాయురాలికి అందజేసిన ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీని ప్రశంసిస్తూ ఉపాధ్యాయులు ఆ చిన్నారిని ఒకరోజు ప్రధానోపాధ్యాయుడి స్థానంలో కూర్చోబెట్టి ప్రోత్సహించారు. శివగంగ జిల్లా మానామధురై బర్మా కాలనీలోని యూనియన్‌ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం 1వ తరగతి చదువుతున్న దీప తరగతి గదికి వచ్చింది. ఆ సమయంలో తరగతి గదిలో లభించిన రూ.50 నగదును ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మికి అందజేసింది. గురువారం తన బ్యాగులో కనిపించకుండా పోయిన డబ్బుగా గుర్తించిన ఆమె దీప నిజాయతీని అభినందించింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జ్ఞానశేఖరన్‌ దీపను అభినందించడంతో పాటు ఆమె నిజాయతీ పలువురికి స్ఫూర్తినిచ్చేలా తన సీటులో ఆమెను కూర్చోబెట్టారు. సాయంత్రం వరకు దీప ఈ సీటులో కూర్చొని హెచ్‌ఎంగా వ్యవహరించారు.

Updated Date - 2022-04-03T13:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising