ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamil Nadu : మత్స్యకార మహిళపై అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-27T22:07:36+05:30

తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మత్స్యకార మహిళ (45)పై సామూహిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మత్స్యకార మహిళ (45)పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఒడిశాకు చెందినవారని, వీరు రొయ్యల చెరువులో పని చేయడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. 


రామనాథపురం పోలీసు సూపరింటెండెంట్ కార్తిక్ మాట్లాడుతూ, ఈ మహిళపై అత్యాచారం కేసులో ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రమేయం ఉందని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి ఎంత మందిని అరెస్టు చేసినదీ ధ్రువీకరిస్తామన్నారు. నిందితులు తమిళం, హిందీ భాషల్లో మాట్లాడలేరని, అందువల్ల దర్యాప్తునకు సమయం పడుతోందని తెలిపారు. బాధితురాలిని కాల్చి చంపినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మృతదేహం రోజు మొత్తం ఆరుబయట ఉండటం వల్ల సూర్యరశ్మికి ఆ విధంగా మారిందన్నారు. 


చేపలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న బాధితురాలు కనిపించకపోవడంతో ఆమె భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఆమెపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-05-27T22:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising