Jharkhandలో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురి దుర్మరణం
ABN, First Publish Date - 2022-01-01T13:11:34+05:30
జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు....
మేదినీనగర్ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మరో 18 మంది గాయపడ్డారు.పాలం జిల్లాలోని హరిహరగంజ్లో పికప్ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు కూలీలు మృతి చెందారు. పాలం జిల్లాలోని పంకికి చెందిన కార్మికులు పొరుగున ఉన్న బీహార్లోని సిహుడి గ్రామంలో వరి కోత తర్వాత తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.బీహార్లోని ఔరంగాబాద్లో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ముగ్గురు మహిళలు చికిత్స పొందుతూ మరణించారని ప్రమాద స్థలానికి చేరుకున్న హరిహరగంజ్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ జైప్రకాష్ నారాయణ్ తెలిపారు.
హరిహరగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 12 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని హరిహర్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సుదామ కుమార్ దాస్ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన మరో ఆరుగురు కూలీలను మెరుగైన చికిత్స కోసం మేదినిరాయ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు.
Updated Date - 2022-01-01T13:11:34+05:30 IST