శూరసంహారిగా Eps
ABN, First Publish Date - 2022-06-29T15:08:59+05:30
అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ పోరు తారస్థాయికి చేరింది. పార్టీలోని మెజార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్)కి జై
- సేలంలో వెలసిన పోస్టర్లు
అడయార్(చెన్నై), జూన్ 28: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ పోరు తారస్థాయికి చేరింది. పార్టీలోని మెజార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్)కి జై కొడుతున్నారు. దీంతో పార్టీ కన్వీనర్ పన్నీర్సెల్వం ఫొటో ఎక్కడ ఉన్నా ఎడప్పాడి మద్దతుదారులు చించేస్తున్నారు. తాజాగా ఎడప్పాడిని శూరసంహారిగా పేర్కొంటూ పోస్టర్లు వేయించి సేలం వ్యాప్తంగా అంటించారు. కిరీటం, చేతిలో శూలంతో ఈపీఎస్ ఈ పోస్టర్లలో దర్శనమిచ్చారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు.
Updated Date - 2022-06-29T15:08:59+05:30 IST