మహిళా సాధికారతకు ద్రౌపది ముర్ము అద్భుతమైన ఉదాహరణ: పట్నాయక్
ABN, First Publish Date - 2022-07-22T09:53:31+05:30
మహిళా సాధికారతకు ద్రౌపది ముర్ము అద్భుతమైన ఉదాహరణ: పట్నాయక్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్మును (Droupadi Murmu) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం అభినందించారు. 'వినీత జీవితం నుంచి దేశానికి ప్రథమ పౌరురాలు కావడానికి ఆమె చేసిన ప్రయాణం... స్ఫూర్తిదాయకం.. మహిళా సాధికారతకు ఆమె ప్రయాణం ఒక ఉజ్వల ఉదాహరణ' అని సీఎం ట్వీట్ చేశారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము ఒడిశాలోని గిరిజన కుటుంబంలో జన్మించారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ ఓట్లను ఆమె సాధించారు. రాష్ట్రపతి అయ్యేందుకు కావాల్సిన ఓట్ల విలువ 5,28,491 కాగా ద్రౌపది ముర్ముకు తొలి ప్రాధాన్యతా ఓట్లు 2824 వచ్చాయి. వీటి విలువ 6,76,803. మరోవైపు విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) కు మూడో రౌండ్ ముగిసేసరికి 1058 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 2,61, 062. ద్రౌపది ముర్ముకు వచ్చిన తొలి ప్రాధాన్యతా ఓట్లను బట్టి ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ మీడియాకు వెల్లడించారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ కూడా అందజేశారు.
Updated Date - 2022-07-22T09:53:31+05:30 IST