ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Two districts: 11 నుంచి శశికళ పర్యటన

ABN, First Publish Date - 2022-09-07T13:30:08+05:30

అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ(Shashikala) ఈ నెల 11 నుంచి సేలం, నామక్కల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ(Shashikala) ఈ నెల 11 నుంచి సేలం, నామక్కల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీలో పట్టును సాధించే దిశగా ఆమె ఈ పర్యటన చేపడుతున్నారు. డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నానని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టి.నగర్‌ నివాసం నుంచి శశికళ కారులో తంజావూరు వెళ్తున్నారు. మరుసటి రోజు ఉదయం తిరుత్తురైపూండి సమీపం పామని వద్ద కొత్తగా నిర్మించిన  సాయబాబా ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమానికి హాజరుకానున్నారు. 11న తంజావూరు నుంచి తిరువయ్యారు, అరియలూరు, పెరంబూలు, వీరకనూరు మీదుగా తలైవాసల్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సేలం ఆత్తూరు బస్‌స్టేషన్‌(Selam Attur Bus Station), పుత్తిరగౌండన్‌ పాళయం, వాళప్పాడి బస్‌స్టేషన్‌ ప్రాంతాల్లో కార్యకర్తలను కలుసుకుంటారు. 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అరియలూరు నుంచి మకుటంచావిడి, శంకగిరి, ఎడప్పాడి జంక్షన్‌, నామక్కల్‌ జిల్లా పళ్లిపాళయం, ఈరోడ్‌ పన్నీర్‌సెల్వం పార్కు తదితర ప్రాంతాల్లో కూడా కార్యకర్తలను కలుసుకుంటారు.

Updated Date - 2022-09-07T13:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising