Kedarnath: కేదార్నాథ్లో దుర్ఘటన.. కుప్పకూలిన హెలికాఫ్టర్.. ఏడుగురు మృతి..
ABN, First Publish Date - 2022-10-18T18:52:52+05:30
కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, ఐదుగురు యాత్రికులు..
ఉత్తరాఖండ్: కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. కేదార్నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాటా దగ్గర ఈ ఘటన జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గుప్త్కాశి నుంచి కేదార్నాథ్కు యాత్రికులను తీసుకెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సీఎంకు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అభినవ్ కుమార్ ఈ ఘటన గురించి వివరాలను వెల్లడించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులతో వెళుతున్న హెలికాఫ్టర్ గరుడ ఛట్టి దగ్గర కూలినట్లు తెలిసిందని.. ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందంతో పాటు జిల్లా అధికార యంత్రాగాన్ని కూడా స్పాట్కు పంపి అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
Updated Date - 2022-10-18T18:52:52+05:30 IST