ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rebel MLAలను Bengal పంపండి: Mamata Banerjee

ABN, First Publish Date - 2022-06-25T00:33:47+05:30

మహారాష్ట్రకు చెందిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్‌కు పంపండని, వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అన్నారు. అస్సాంలోని గువహాటిలో ఉన్న ఒక హోటల్‌లో సదరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం విడిది పొందుతున్న విషయం తెలిసిందే. అస్సాంలో ఒక వైపు వరదలు వస్తుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: మహారాష్ట్రకు చెందిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్‌కు పంపండని, వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అన్నారు. అస్సాంలోని గువహాటిలో ఉన్న ఒక హోటల్‌లో సదరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం విడిది పొందుతున్న విషయం తెలిసిందే. అస్సాంలో ఒక వైపు వరదలు వస్తుంటే.. మహా ఎమ్మెల్యేలు ఇక్కడ విడిది పొందడమేంటని, సదరు ఎమ్మెల్యేలు ఉన్న రాడిసన్ బ్లు హోటల్ ముందు టీఎంసీ కార్యకర్తలు గురువారం నిరసన చేపట్టారు.


కాగా, శుక్రవారం ఈ విషయమై మమత స్పందిస్తూ ‘‘ప్రజాస్వామ్యంపై బీజేపీ బుల్డోజర్ ఎక్కుపెట్టింది. ఇది చాలా బాధకరమైంది. సమాఖ్య స్పూర్థిని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహారణ. అస్సాంలో వరదలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ అస్సాం ముఖ్యమంత్రికి ఇవేవీ పట్టినట్టు లేదు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు రెబెల్ ఎమ్మెల్యేలకు విడిది పనులు చూసుకోవడంలో ఆయన బిజీగా ఉన్నారు’’ అని అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘అస్సాంలో వాతావరణ పరిస్థితులు బాగాలేవు. మహా ఎమ్మెల్యేలను బెంగాల్ పంపండి. వారికి ఎలాంటి లోటు రాకుండా మేం చూసుకుంటాం’’ అని అన్నారు.

Updated Date - 2022-06-25T00:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising