ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రదాడి ఘటనల ఎఫెక్ట్: ఎన్‌సీఆర్‌లో high alert

ABN, First Publish Date - 2022-05-17T12:57:33+05:30

పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్‌సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు.ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అందిన సమాచారంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.గత వారం మొహాలిలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్‌తో నడిచే గ్రెనేడ్  విసరడంతో కిటికీలు ధ్వంసమైన పేలుడు సంభవించింది. మొహాలీ పేలుడుకు ఒక రోజు ముందు పంజాబ్ పోలీసులు ఉగ్రదాడిని అడ్డుకున్నారు. 


తర్న్ తరన్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆర్డీఎక్స్ తో ప్యాక్ చేసిన పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.రా చీఫ్ సూచనల మేర ఎన్సీఆర్ ప్రాంతంలో అద్దెదారులు, డ్రైవర్లు, సహాయకులు, పనిమనిషిలందరిపై పోలీసులు నిఘా పెంచారు. ఎన్సీఆర్ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.ఎన్సీఆర్ ప్రాంతంలోని కంపెనీలు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు.


Updated Date - 2022-05-17T12:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising