ఉదయ్పూర్లో 44 సెక్షన్ అమలు, ఇంటర్నెట్ కట్
ABN, First Publish Date - 2022-06-29T03:46:17+05:30
నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ను షేర్ చేసిన ఓ యువకుడు మంగళవారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని ఇద్దరు అగంతులు తలనరికి మరీ చంపారు. ఉదయ్పూర్లోని మాల్డాస్ స్ట్రీట్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉదయ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది..
జైపూర్: నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పరిస్థితులు అదుపు దాట కుండా ఉండేదుకు ఉదయ్పూర్లోని ధన్మంది, ఘంటాఘర్, హతిపోల్, అంబమాత, సూరజ్పోల్, భుపాల్పుర, సవిన పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కర్ఫ్యూ విధించినట్లు 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు రాజస్తాన్ పోలీసులు తెలిపారు. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవే నిబంధనలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ను షేర్ చేసిన ఓ యువకుడు మంగళవారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని ఇద్దరు అగంతులు తలనరికి మరీ చంపారు. ఉదయ్పూర్లోని మాల్డాస్ స్ట్రీట్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉదయ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల్డాస్ స్ట్రీట్ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అదనంగా 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. మరోవైపు, ఈ దారుణానికి పాల్పడిన అగంతకులు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందంటూ ఆ వీడియోలో హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఉదయ్పూర్ ఎస్పీ మాట్లాడుతూ, ఇది అత్యంత కిరాతకమైన హత్య అని, దీనిపై తాము దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. పలువురు నిందితులను గుర్తించామని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చర్యకు తామే పాల్పడినట్టు చెబుతూ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రశాంతంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి
కాగా, ఉదయ్పూర్లో ఉద్రిక్తతలు తలెత్తడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెంటనే స్పందించారు. ఉదయ్కుమార్లో ఒక యువకుని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, వీడియోను ఎవరికీ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-06-29T03:46:17+05:30 IST