ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా దాడుల్లో మిలటరీ శిక్షణా కేంద్రం ధ్వంసం.. 9 మంది మృతి

ABN, First Publish Date - 2022-03-13T21:20:31+05:30

ఉక్రెయిన్‌పై రష్యా గగనతల దాడులు ఆదివారం మరింత తీవ్ర చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌‌లోని సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన దాడిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా గగనతల దాడులు ఆదివారం మరింత తీవ్ర చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌‌లోని సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన దాడిలో కనీసం 9 మంది మృతి చెందగా, 57 మంది వరకూ గాయపడినట్టు స్థానిక అధికారులను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. పోలాండ్‌తో సరిహద్దుకు సమీపంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ విషయాన్ని లివివ్ రీజియన్ గవర్నర్ కోజిట్‌స్కీ ధ్రువీకరించారు. యవోరివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా బలగాలు 30కి పైగా క్రూయిజ్ క్షిపణలతో దాడి జరిపినట్టు ఆయన చెప్పారు. ఈ మిలటరీ రేంజ్ లివివ్ సిటీకి వాయవ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో, పోలాండ్‌తో ఉక్రెయిన్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్టు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ నాటో డ్రిల్స్‌ కూడా గతంలో జరిగాయి.

Updated Date - 2022-03-13T21:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising