కైవ్లో పౌరుల కారుపై Russian దళాల కాల్పులు...ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2022-03-05T17:46:17+05:30
ఉక్రెయిన్ దేశంపై సైనికచర్యకు దిగిన రష్యా సైనికులు పౌరుల కార్లపైనా కూడా కాల్పులు జరిపారు....
మరో నలుగురికి గాయాలు
కైవ్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై సైనికచర్యకు దిగిన రష్యా సైనికులు పౌరుల కార్లపైనా కూడా కాల్పులు జరిపారు. శనివారం ఉదయం ఉక్రెయిన్ దేశ రాజధాని నగరమైన కైవ్కు సమీపంలోని బుచా జిల్లాలో రష్యన్ సైనికులు ఓ ప్రైవేటు కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరణించిన వారిలో 17 ఏళ్ల బాలిక కూడా ఉంది. రష్యా సేనల దాడుల్లో మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఇర్పిన్ పట్టణంలోని మిలటరీ ఆసుపత్రిపై రష్యా సైనికులు బాంబులతో దాడి చేశారు.
Updated Date - 2022-03-05T17:46:17+05:30 IST