ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 1.54 కోట్ల ‘ఆమ్నెస్టీ’ ఆస్తుల జప్తు

ABN, First Publish Date - 2022-10-08T09:09:20+05:30

అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ’కి అనుబంధంగా మన దేశంలో పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (ఏఐపీఎల్‌) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం జప్తు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీబీఐ కేసుతో ఈడీ చర్యలు

న్యూఢిల్లీ, అక్టోబరు 7: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ’కి అనుబంధంగా మన దేశంలో పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (ఏఐపీఎల్‌) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం జప్తు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) ఉల్లంఘించి నిధులు సేకరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆమ్నెస్టీకి చెందిన రూ.1.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. 2011-12 మధ్య విరాళాలు తీసుకోడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సంస్థ 2012-13, 2013-14, ఆర్థిక సంవత్సరాల్లో కూడా నిధులు సేకరించిందని సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిపై ఈడీ కూడా సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించి మనీలాండరింగ్‌ జరిగిందని నిర్ధారించుకుని ఆస్తులను జప్తు చేసింది. 

Updated Date - 2022-10-08T09:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising