ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Goa నుంచి Hyderabad వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

ABN, First Publish Date - 2022-06-03T17:17:46+05:30

కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక/హైదరాబాద్: కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా, కమలాపురం (Kamalapuram) సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణీకులు మృతి చెందారు. లారీని ఢీకొన్న తర్వాత బస్సు బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. 12 మందిని స్థానికులు కాపాడారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-06-03T17:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising