ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైని యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర: రౌత్

ABN, First Publish Date - 2022-04-08T20:44:57+05:30

భారతీయ జనతా పార్టీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ చేశారు. ముంబైను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారతీయ జనతా పార్టీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ చేశారు. ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని అన్నారు. ఈ గ్రూప్‌నకు కీరిత్ సోమయ్య నాయకుడని చెప్పారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో రౌత్ మాట్లాడుతూ, కొందరు నేతలు, వ్యాపారవేత్తలు, బిల్డర్లు ఈ గ్రుపులో ఉన్నారని, రెండు నెలలుగా ఈ గ్రూపు కసరత్తు చేస్తోందని, ఇందుకు సంబంధించి (యూటీగా మార్చేందుకు) హోం మంత్రి ముందు ఒక ప్రెజెంటేషన్‌ కూడా రెడీ చేశారని ఆరోపించారు. మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య ముంబైలో తగ్గిందనే కారణం వీరు కోర్టుకు వెళ్లవచ్చని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరే అవకాశం ఉందని రౌత్ అన్నారు.

Updated Date - 2022-04-08T20:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising