Rameswaram: అగ్నితీర్థానికి పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2022-08-27T14:08:54+05:30
సర్వ అమావాస్య సందర్భంగా రామేశ్వరం(Rameswaram) ఆలయానికి శుక్రవారం ఉదయం వేలాదిమంది భక్తులు తరలివెళ్ళారు. రామనాథస్వామివారి
చెన్నై, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సర్వ అమావాస్య సందర్భంగా రామేశ్వరం(Rameswaram) ఆలయానికి శుక్రవారం ఉదయం వేలాదిమంది భక్తులు తరలివెళ్ళారు. రామనాథస్వామివారి ఆలయం సమీపంలో ఉన్న అగ్నితీర్థంలో పుణ్యస్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు విడిచారు. వేకువజామున ఐదు గంటల నుంచే భక్తులు అగ్నితీర్థం(Agnitirtha) గట్టుపైకి రాగా పురోహితులు మంత్రోచ్ఛారణలు చేస్తుండగా తిథి తర్పణ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు ఆలయంలోని తీర్థాలలో స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దీంతో రామనాథస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
Updated Date - 2022-08-27T14:08:54+05:30 IST