ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వియత్నాం పర్యటనకు Rajnath Singh.. రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-06-06T01:09:19+05:30

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 8న వియత్నాం వెళ్లనున్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 8న వియత్నాం వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ మేరకు రక్షణశాఖ తెలిపింది. ఈ సందర్భంగా హాయి ఫాంగ్‌లోని హాంగ్ హా యార్డ్‌లో వియత్నాంకు 12 హైస్పీడ్ బోట్లను అందజేసే కార్యక్రమానికి రాజ్‌నాథ్ అధ్యక్షత వహిస్తారు. 100 మిలియన్ డాలర్ల రక్షణ శ్రేణి కింద  ఎల్ అండ్ టీ (L&T) ఈ బోట్లను నిర్మించింది. 


వియత్నాంతో రక్షణ పరిశ్రమ సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనదని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్' వంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను ఇది ఉదహరిస్తుందని తెలిపింది. వియత్నాం మాజీ అధ్యక్షుడు హోచి మిన్‌కు హనోయిలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించడంతో సింగ్ వియత్నాం పర్యటన ప్రారంభమవుతుంది.

Updated Date - 2022-06-06T01:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising