ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

lightning strikes: పిడుగుపాటుకు ఏడుగురి మృతి

ABN, First Publish Date - 2022-09-12T14:20:01+05:30

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో మరోసారి పిడుగులు(lightning strikes) పడ్డాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో నలుగురికి గాయాలు

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో మరోసారి పిడుగులు(lightning strikes) పడ్డాయి.జాల్వార్, ఉదయపూర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్, బార్మేర్, దుగార్ పూర్, బుండీ, అజ్మీర్, ఫలోది, బికనేర్ ప్రాంతాల్లో భారీవర్షంతోపాటు(heavy rainfall) ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు( lightning) పడ్డాయి. పిడుగుపాటుకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అస్నాపూర్, ఖాన్పూర్, మండవార్, దంగిపురా జిల్లాల్లో పిడుగుపాటుకు శనివారం కూడా ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. 



టోంక్, అల్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, కోట బారన్, జాల్వార్, ఉదయపూర్ జిల్లాల్లో భారీవర్షంతో పాటు భారీ గాలులు వీస్తున్నాయి.బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలో తరచూ పిడుగుపాటుకు జనం మరణిస్తున్నారు. 

Updated Date - 2022-09-12T14:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising