హక్కులను కాలరాస్తున్న కేంద్రం: రాహుల్
ABN, First Publish Date - 2022-01-23T07:43:39+05:30
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు...
న్యూఢిల్లీ, జనవరి 22: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రాథమిక హక్కులతోపాటు హక్కులులేని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ను ఊహించగలరా? అని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అవకాశాలు లేకుండా చేస్తోందని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యువజన మ్యానిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీలో ప్రతి 24 గంటలకు 880 మంది యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని, గత అయిదేళ్లలో 16 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు.
Updated Date - 2022-01-23T07:43:39+05:30 IST