మెరుగుపడిన Lalu Prasad Yadav ఆరోగ్యం.. AIIMSలో రాహుల్ గాంధీ పరామర్శ
ABN, First Publish Date - 2022-07-09T02:59:23+05:30
ఆరోగ్యం విషమించడంతో AIIMS(ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) చికిత్స పొందుతున్న ఆర్జేడీ(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు ఆస్పత్రివ
న్యూఢిల్లీ : ఆరోగ్యం విషమించడంతో AIIMS(ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఆరోగ్యం మెరుగుపడింది. కొన్ని రోజుల వ్యవధిలోనే లాలూని క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి సాధారణ గదిలోకి మార్చుతామని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా లాలూని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పరామర్శించారు. శుక్రవారం ఎయిమ్స్కి వెళ్లి మరీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హాస్పిటల్ నుంచి రాహల్ బయటకొస్తున్న వీడియోలో ఏఐసీసీ(AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) కనిపించారు.
బిహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా బీపీ, షుగర్తోపాటు పలు వ్యాధులతో బాధపడుతున్న 74 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2 రోజుల క్రితమే ఎయిర్ అంబులెన్స్లో ఆయను ఢిల్లీలోని ఎయిమ్స్కి తరలించిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-07-09T02:59:23+05:30 IST