ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kashmir అధికారానికి నిచ్చెనలా మారింది: Rahul Gandhi

ABN, First Publish Date - 2022-06-02T22:31:43+05:30

భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) అధికారానికి నిచ్చెనలా మారిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్ చనిపోవడంపై ఆయన స్పందిస్తూ బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) అధికారానికి నిచ్చెనలా మారిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్ చనిపోవడంపై ఆయన స్పందిస్తూ బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్‌ను కాపాడాల్సిన వారు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘బ్యాంక్ మేనేజర్, టీచర్ ఇలా ఎంతో మంది అమాయకులు ప్రతిరోజు బలి అవుతున్నారు. కశ్మీరీ పండిట్లు పారిపోతున్నారు. వారిని కాపాడాల్సిన వారు సినిమా ప్రమోషన్లకే టైం సరిపోకుండా ఉన్నారు. బీజేపీకి కశ్మీర్ కేవలం అధికారం ఎక్కడానికి ఉపయోగపడే నిచ్చెనలా మారోపోయింది. ప్రధాని.. కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోండి’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2022-06-02T22:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising