పునీత్కు సహకార రత్న పురస్కారం
ABN, First Publish Date - 2022-03-19T17:03:45+05:30
పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ను మరణానంతరం సహకార రత్న పురస్కారానికి ఎంపిక చేశామని సహకారశాఖ మంత్రి ఎస్టీ సోమశేఖర్ ప్రకటించారు. శుక్రవారం విధానసౌధ
- మంత్రి ఎస్టీ సోమశేఖర్
బెంగళూరు: పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ను మరణానంతరం సహకార రత్న పురస్కారానికి ఎంపిక చేశామని సహకారశాఖ మంత్రి ఎస్టీ సోమశేఖర్ ప్రకటించారు. శుక్రవారం విధానసౌధ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక మిల్క్ఫెడరేషన్, విద్యాశాఖతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు రాయబారిగా వ్యవహరించిన పునీత్రాజ్కుమార్ ఎటువంటి పారితోషకం తీసుకునేవారు కాదన్నారు. 100 మందితో కూడిన జాబితా చేరిందని ముఖ్యమంత్రితో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. సాధారణంగా ఏడాదికి ఆరుగురికి సహకారరత్న పురస్కారాలు ఇచ్చేవారమని, గత ఏడాది జిల్లాకు ఒకరు చొప్పున ఇవ్వాలని తీర్మానించామన్నారు. 20న ఆదివారం కెంగేరి గణేష్ మైదానంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. శనివారం జాబితా వి డుదల చేస్తామని కనీసం 40 మందికి పురస్కారాలను అందిస్తామన్నారు.
Updated Date - 2022-03-19T17:03:45+05:30 IST