Puneeth Rajkumar: పాఠ్యాంశంగా పునీత్ రాజ్కుమార్ చరిత్ర
ABN, First Publish Date - 2022-12-02T12:35:24+05:30
కర్ణాటక రత్న, పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్(Puneeth Rajkumar) జీవితచరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి బ సవరా
- సీఎంకు భారతి నగర్ రెసిడెంట్స్ ఫోరం లేఖ
బెంగళూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రత్న, పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్(Puneeth Rajkumar) జీవితచరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి బ సవరాజ బొమ్మైకు, నగరంలోని భారతినగర్ రెసిడెంట్స్ ఫోరం విజ్ఞప్తిచేసింది. ఫోరం అధ్యక్షుడు ఎన్ఎస్ రవి ఈ మేరకు సిఎంకు లేఖరాశారు. పునీత్ వందలాది మంది నిరుపేద విద్యార్ధులను అనాధలను తన సొంత ఖర్చుతో చదివించి గొప్ప మానవతా మూర్తిగా నిలిచారన్నారు. పునీత్ జీవిత చరిత్ర ద్వారా విద్యార్ధులు స్పూర్తిపొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పునీత్ మృతి తర్వాతే ఆయన చేసిన సామాజిక సేవలు వెలుగు చూశాయని రవి తన లేఖలో గుర్తుచేశారు. ప్రత్యేకించి పునీత్ రాజ్కుమార్ నేత్రదానాన్ని, స్వయం ప్రేరిత రక్తదానాన్ని పోత్సహించారని ఎన్నో వృద్ధాశ్రమాలకు అండగా నిలిచారన్నారు. ప్రభుత్వం తన లేఖపై సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని రవి వ్యక్తంచేశారు.
Updated Date - 2022-12-02T12:36:32+05:30 IST