ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pune-Bengaluru బస్సును ఢీకొన్న లారీ...ఏడుగురి మృతి

ABN, First Publish Date - 2022-05-24T15:57:22+05:30

పూణే-బెంగళూరు మధ్య ఉన్న 4వనంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

26 మంది ప్రయాణికులకు గాయాలు

బెంగళూరు: పూణే-బెంగళూరు మధ్య ఉన్న 4వనంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పూణే నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు బస్సు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 26మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుబ్బలిలోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.బస్సు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బయలుదేరి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.


Updated Date - 2022-05-24T15:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising