ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థ్యాంక్యూ Tamilnadu

ABN, First Publish Date - 2022-05-28T14:01:15+05:30

ఒక్కరోజు పర్యటన కోసం చెన్నై వచ్చిన తనకు అపూర్వ స్వాగతం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - ప్రధాని మోదీ ట్వీట్‌


అడయార్‌(చెన్నై): ఒక్కరోజు పర్యటన కోసం చెన్నై వచ్చిన తనకు అపూర్వ స్వాగతం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ తమిళనాడు. రాష్ట్రంలో నిన్న చేపట్టిన పర్యటన మరిచిపోలేనిది’ అని పేర్కొంటూ తన కార్యక్రమంలోని హైలెట్స్‌తో కూడిన 2.7 నిమిషాల నిడివి కలిగిన వీడియో కూడా శుక్రవారం పోస్ట్‌ చేశారు. గురువారం చెన్నై వచ్చిన ప్రధాని.. రూ.31,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయనకు డీఎంకే, బీజేపీ కార్యకర్తలతో పాటు నగర వాసులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో తన చెన్నై పర్యటనపై ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్‌ చేశారు. 


మోదీపై ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయి: అమిత్‌ షా 

తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీ పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కూడా శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమంత్రి పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయి. తమిళనాడు ప్రధాని మోదీని కోరుకుంటోంది’ అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-05-28T14:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising