ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో దుర్మరణం పాలైన విద్యార్థి కుటుంబానికి ప్రధాని పరామర్శ

ABN, First Publish Date - 2022-03-01T23:51:24+05:30

రష్యా బాంబు దాడిలో, ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ విద్యార్థి శేఖరప్ప నవీన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. నవీన్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ సానుభూతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా బాంబు దాడిలో, ఉక్రెయిన్‌లో దుర్మరణం పాలైన భారతీయ విద్యార్థి శేఖరప్ప నవీన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. నవీన్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజు బొమ్మై కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నవీన్ కుటుంబం తనకు చాలాకాలం నుంచి తెలుసని, విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇదే ఘటనలో కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారని బొమ్మై చెప్పారు. విద్యార్థి మృతదేహంతోపాటు బాధితులను ఇండియా తీసుకొచ్చే విషయంలో సహకరించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి, విదేశీ వ్యవహారాల శాఖను బొమ్మై కోరారు. నవీన్ మృతిపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ సంతాపం వ్యక్తం చేశారు.







Updated Date - 2022-03-01T23:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising