Modi Shah: మోదీ వెళ్లారు.. షా వచ్చారు
ABN, First Publish Date - 2022-09-03T02:28:34+05:30
తిరువనంతపురం: కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది.
తిరువనంతపురం: కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. తిరువనంతపురం చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. కేరళలో షా రెండు రోజుల పాటు పర్యటిస్తారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో షా పాల్గొంటారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రి విజయన్తో కలిసి ఆయన అలప్పుజాలో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు.
అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలో తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది శంకరాచార్య జన్మించిన కాలడి గ్రామాన్ని సందర్శించారు. ఆదిశంకరాచార్య జన్మభూమి క్షేత్రంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. కొచ్చిలో భారీ వర్షం పడుతున్నా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా నిలబడి ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు.
స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయంగా భారత్ తయారుచేసుకున్న తొలి విమానవాహక నౌక విక్రాంత్ను కొచ్చిలో ప్రధాని నౌకాదళానికి అప్పగించారు.
కేరళలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు బీజేపీ నిర్వహించిన ఓ సభలోనూ ప్రసంగించారు.
Updated Date - 2022-09-03T02:28:34+05:30 IST