ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arunachal pradesh: మీ కళ్లద్దాలు మార్చుకోండి..విమర్శకులకు మోదీ కౌంటర్

ABN, First Publish Date - 2022-11-19T15:23:51+05:30

అరుణాచల్ ప్రదేశ్‌లోని డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. హోలింగిలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ (Donyi polo Airport)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు ప్రారంభించారు. హోలింగిలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో ఈశాన్య రాష్ట్రాల్లో టూరిజం మరింత అభివృద్ధి కానుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విపక్షాలు గతంలో విమానాశ్రయ నిర్మాణంపై చేసిన ఆరోపణలకు మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలోంచే వాళ్లు (విమర్శకులు) చూస్తుంటారని, అలాంటి వాళ్లు పాత కళ్లద్దాలు మార్చుకోవాలని ఆయన సూచించారు.

మూడేళ్ల క్రితం డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసినప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలంటూ మోదీపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ విమర్శలకు మోదీ శనివారం స్పందిస్తూ, 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్ ‌కు శంకుస్థాపన చేశానని, 2019 మేలో ఎన్నికలు ఉండటంతో విమర్శకులు గగ్గోలు చేశారని అన్నారు. ప్రతీదీ పాత కళ్లద్దాలతో చూడటం అలవాటు ఉన్న విమర్శకులు.. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ఇక్కడకు వచ్చారని, ఎప్పటికీ విమానాశ్రయ నిర్మాణం జరగదని విమర్శించినట్టు చెప్పారు. ప్రతీ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే అలవాటు ఉన్న వారికి ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభం కావడం చెంపపెట్టు అని చెప్పారు. పాత కళ్లద్దాలు తొలగించాలని వారికి చెప్పదలచుకున్నానని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో దేశం ప్రగతి పథం వైపు దూసుకెళ్తోందని, ఇప్పటికైనా ప్రతి విషయానికి రాజకీయ రంగు పులమడం మానుకోవాలని విమర్శకులకు హితవు పలికారు.

దీనికి ముందు, అరుణాచల్ ప్రదేశ్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ''డోనీ పోలో'' (సూర్యుడు-చంద్రుడు)ను మోదీ ప్రారంభించారు. 690 ఎకరాల విస్తీర్ణంలో రూ.640 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. గంట‌కు 200 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయ‌గ‌లిగే ఎనిమిది చెక్ ఇన్ కౌంట‌ర్లు నిర్మించారు. 2300 మీట‌ర్ల ర‌న్‌వే ఉంది. బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్రయాన్ని నిర్మించారు. డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌తో అరుణాచ‌ల్‌లో మొత్తం మూడు విమానాశ్రయాలు అందుబాటులోకి రాగా, ఈశాన్య రాష్ట్రాల్లో విమానాశ్రయాల సంఖ్య 16కు చేరింది.

Updated Date - 2022-11-19T16:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising