ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనగర్‌లో తీవ్రవాద దాడి.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

ABN, First Publish Date - 2022-04-04T23:49:35+05:30

శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్‌లపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో్ ఒక జవాను మృతిచెందాడు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్‌లపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో్ ఒక జవాను మృతిచెందాడు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో ఉన్న మైసుమాలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్‌లపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు అక్కడే రోడ్డుపై కూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని జవాన్లను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ఒక జవాను మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గర్లోని మరో ప్రాంతంలో కూడా సామాన్యులపై తీవ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతం జనసంచారంతో చాలా రద్దీగా ఉంటుంది. మరోవైపు దగ్గర్లో చెక్‌పోస్టులు కూడా ఉంటాయి. అయినప్పటికీ, కాల్పుల ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-04-04T23:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising