NTRకు టీడీపీ నేతల ఘన నివాళి
ABN, First Publish Date - 2022-01-19T14:47:51+05:30
ntr tdp leaders chennai tamilnadu state
చెన్నై: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ నాయకులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరం, తెలుగువాడి కీర్తిని నలుదిశాలా చాటిచెప్పున మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఇలవేల్పుగా తనకు ఎదురైన ప్రతి సవాలును సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని, నిబద్ధత, నిజాయతీ, నిస్వార్థం ఇవే ఆయన ఆయుధాలని పేర్కొన్నారు. అందుకే ఆయన ఎన్నో సాహోసేపత నిర్ణయాలు తీసుకుని వ్యవస్థను, సమాజాన్ని సంస్కరించి తెలుగుజాతి ముద్దుబిడ్డగా తెలుగు ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో ఆస్కా మాజీ అధ్యక్షుడు ఆదిశేషయ్య, ఐజేకే రవిబాబు, టీడీపీ ఇన్ఛార్జి చంద్రశేఖర్, ప్రొఫెషనల్ వింగ్ చెన్నై టీడీపీ ఫోరమ్ అధ్యక్షుడు మహేంద్రబాబు, నాయకులు శ్రీనివాస్, రాజేష్, ట్రిప్లికేన్ వెంకటేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-19T14:47:51+05:30 IST