ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎన్‌బీ కుంభకోణం కేసులో Nirav Modi సన్నిహితుడి అరెస్ట్

ABN, First Publish Date - 2022-04-12T15:15:47+05:30

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్ మోదీ సన్నిహితుడిని సీబీఐ భారత్‌కు తీసుకొచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్ మోదీ సన్నిహితుడిని సీబీఐ భారత్‌కు తీసుకొచ్చింది.పీఎన్‌బీ మోసం కేసులో నీరవ్ మోదీ సన్నిహితుడు సుభాష్ శంకర్‌ను సీబీఐ కైరోలో అదుపులోకి తీసుకుని మళ్లీ ముంబైకి తీసుకొచ్చింది.పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సన్నిహితుడు సుభాష్ శంకర్ కైరోలో సీబీఐ అధికారులకు దొరికాడు. 2018వ సంవత్సరంలో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో ఉన్నాడని సీబీఐకు అందిన సమాచారం ఆధారంగా సీబీఐ ఈ ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని పట్టుకుంది. సుభాష్ శంకర్‌ను ముంబై సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.


Updated Date - 2022-04-12T15:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising