60 మూగజీవాల ప్రాణాలను కాపాడిన నవనీత్ కౌర్
ABN, First Publish Date - 2022-01-12T02:50:33+05:30
ఒంటెల వధను అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అడ్డుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఒంటెలను ...
అమరావతి: ఒంటెల వధను అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అడ్డుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఒంటెలను తరలిస్తున్నారు. హైదరాబాద్లో ఒంటెల వధ కోసం వ్యాపారులు తీసుకొస్తున్నారు. విషయం తెలుసుకున్న నవనీత్ కౌర్.. మూగజీవాల ప్రాణాలను కాపాడారు. 1100 కి.మీ. నుంచి ఒంటెలను వధించేందుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న 60 మూగజీవాల ప్రాణాలను నవనీత్ కౌర్ కాపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ ఇప్పటికే చాలా ఒంటెలను హైదరాబాద్కు తరలించారు. అమరావతి నియోజకవర్గంలో ఒంటెలను ఉంచినట్టు నాకు సమాచారం అందింది. వెంటనే అధికారులకు సమాచారం అందించాను. అధికారులు స్పందించి ఒంటెలను స్వాధీనం చేసుకున్నారు.’’ అని తెలిపారు.
Updated Date - 2022-01-12T02:50:33+05:30 IST