ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

ABN, First Publish Date - 2022-06-25T14:57:22+05:30

దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు తెరచి చూడగ అందులో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. ఈ విషయంలపై స్థానికులు పోలీసులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు.  


ఆ పిండాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.మహేష్ కోని ఈ ఘటనపై స్పందిస్తూ.. మొదట పిండాల లింగ నిర్ధారణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈ పిండాలను బెల్గావి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపిస్తామన్నారు. దీనిపై కొంతమంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Updated Date - 2022-06-25T14:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising