లోక్సభలో కాంగ్రెస్ నేతలకు ప్రధాని చురకలు
ABN, First Publish Date - 2022-02-08T00:24:31+05:30
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభలో సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతల తీరుపై నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ నేతలకు గర్వం, అహంకారం తగ్గలేదన్నారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందని లెక్కలేసి చెప్పారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్కు అధికారం దక్కలేదని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రావొద్దని కోరుకుంటున్నట్లుగా ఉందంటూ చురకలేశారు. రెండేళ్లుగా భారత్ కోవిడ్పై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.
Updated Date - 2022-02-08T00:24:31+05:30 IST