ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వం మరచి.. మత్తుమందు ఇచ్చి...

ABN, First Publish Date - 2022-09-28T17:08:11+05:30

మనిషి మృగంలా మారుతున్నాడు.. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడున్న ఘటనలనూ చూస్తూనే ఉన్నాం.. అయితే అలాంటి మనుషులు జంతువులను సై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి(బెంగళూరు): మనిషి మృగంలా మారుతున్నాడు.. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడున్న ఘటనలనూ చూస్తూనే ఉన్నాం.. అయితే అలాంటి మనుషులు జంతువులను సైతం వదలకుండా వేధించి చంపడం.. దిగజారిన మానవత్వ విలువలకు అద్దం పడుతోంది. కోతులకు మత్తుమందు ఇచ్చి చింతచెట్లకు ఉరివేసిన ఘటన బీదర్‌ జిల్లా పరిధిలోని మురాళ గ్రామంలో చోటు చేసుకుంది. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నాలుగు కోతులను మత్తుమందు ఇచ్చి చంపేయడం మంగళవారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలానికి నిట్టూరు పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోతుల సామూహిక హత్యను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-09-28T17:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising