Former Mayor: 24న మహిషి దసరా జరిపి తీరుతాం..
ABN, First Publish Date - 2022-09-22T17:55:40+05:30
మైసూరు చాముండేశ్వరి కొండలపై మహిషాసుర విగ్రహం వద్ద ఈ నెల 24న మహిషి దసరా వేడుకలను నిర్వహించనున్నారు. మైసూరు మాజీ
- మైసూరు మాజీ మేయర్ పురుషోత్తమ్
బెంగళూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మైసూరు చాముండేశ్వరి కొండలపై మహిషాసుర విగ్రహం వద్ద ఈ నెల 24న మహిషి దసరా వేడుకలను నిర్వహించనున్నారు. మైసూరు మాజీ మేయర్ పురుషోత్తమ్(Purushottam, former mayor of Mysore) బుధవారం మీడియాతో మాట్లాడుతూ మహిషి దసరా వేడుకలను ఎవరు అడ్డుకున్నా వెనుకాడేది లేదని, తమ నిర్ణయంలో మార్పు ఉండదని తెగేసి చెప్పారు. ఈ ఉత్సవాన్ని ఎవరినీ అవమానపరిచేందుకు నిర్వహించడం లేదని అయినా గత మూడేళ్లుగా అడ్డుకుంటూ వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైసూరు ఎంపీ ప్రతాప్సింహకు తమకు ఈ ఉత్సవాల నిర్వహణ విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నమాట నిజమేనని, వీటిని ఆయన ఇంటిముందు ఏమైనా నిర్వహిస్తున్నామా? అని ఆయన ప్రశ్నించారు. ఆరు నూరైనా ఈ ఉత్సవాలను నిర్వహించే తీరుతామని ఆయన ప్రకటించారు.
Updated Date - 2022-09-22T17:55:40+05:30 IST