ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharastra లో Muslim మతపెద్ద కాల్చివేత.. అఫ్ఘనిస్తాన్ పౌరుడిగా గుర్తింపు

ABN, First Publish Date - 2022-07-06T17:52:22+05:30

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లిం(Muslim) మతపెద్ద హత్యకు గురయ్యాడు. నాసిక్ జిల్లా యోలా పట్టణంలో నలుగురు దుండగులు తుపాకీతో కాల్చిచంపారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర(Maharastra)లోని నాసిక్ జిల్లాలో ముస్లిం(Muslim) మతపెద్ద హత్యకు గురయ్యాడు. నాసిక్ జిల్లా యోలా(Yeola) పట్టణంలో నలుగురు దుండగులు తుపాకీతో కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణం ఏమిటో తెలియరాలేదని వెల్లడించారు. బాధితుడు అఫ్ఘనిస్తాన్‌(Afghanistan)కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ (Khwaja Sayyad Chishti) గా గుర్తించామని, ఇతడిని స్థానికంగా ‘సూఫీ బాబా’గా పిలుస్తారని అధికారులు తెలిపారు. ముంబై నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే యోలా(Yeola) పట్టణంలోని ఎంఐడీసీ ఏరియాలో బహిరంగ ప్రదేశంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.


నుదుటిపై కాల్చడంతో ఖ్వాజా చిస్తీ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఖ్వాజా వినియోగించే ఎస్‌యూవీ వాహనంలోనే దుండగులు పరారయ్యారని పోలీసు అధికారులు వివరించారు. ఈ మేరకు యోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. హంతకుల కోసం వేట కొనసాగుతోందని చెప్పారు.

Updated Date - 2022-07-06T17:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising