MSSOS registered : 25లోగా ఎంఎ్సవోలు రిజిస్టర్ చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-11-17T03:53:28+05:30
ల్టీ సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎ్సవో)లు ఈ నెల 25లోపు కేంద్ర సమాచార, ప్రసార శాఖలో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
న్యూఢిల్లీ: మల్టీ సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎ్సవో)లు ఈ నెల 25లోపు కేంద్ర సమాచార, ప్రసార శాఖలో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా రిజిస్టర్ చేసుకోకపోతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించింది. కేబుల్ టీవీ ఆపరేటర్లందరూ హెడ్ ఎండ్ లొకేషన్లు, కండిషనల్ యాక్సెస్ సిస్టమ్, ఫ్రీక్వెన్సీ సమాచారం, ఆర్ఎఫ్ ఫీడ్ వివరాలు, సీటీఏవీ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలు వంటి వివరాలన్నింటినీ సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మేలో ఆదేశించింది. అయితే ఇప్పటికీ కొందరు ఎంఎ్సవోలు వివరాలు సమర్పించలేదని, ఈ నెల 25లోపు రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
Updated Date - 2022-11-17T03:53:29+05:30 IST