Kalinger: ఎంపీ టీఆర్ బాలుకు కలైంజర్ అవార్డు
ABN, First Publish Date - 2022-09-03T15:19:21+05:30
అధికార డీఎంకే ముప్పెరుం వేడుకల్లో అవార్డు గ్రహీతల వివరాలను అన్నా అరివాలయం శుక్రవారం విడుదల చేసింది. తందై పెరియార్, అన్నా
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 2: అధికార డీఎంకే ముప్పెరుం వేడుకల్లో అవార్డు గ్రహీతల వివరాలను అన్నా అరివాలయం శుక్రవారం విడుదల చేసింది. తందై పెరియార్, అన్నాదురై జయంతి, డీఎంకే ఆవిర్భావ దినం ఈ మూడింటిని ఈ నెల 15న ముప్పెరుం వేడుకల పేరిట డీఎంకే నిర్వహించనుంది. పెరియార్ అవార్డు సంపూర్ణం స్వామినాథన్కు, అన్నాదురై అవార్డు కోవై మోహన్కు, పావేందర్ అవార్డు పుదుచ్చేరి తిరునావుక్కరసుకు, ప్రొఫెసర్ అన్బళగన్ అవార్డు కున్నూరు శ్రీనివాసన్కు, కలైంజర్ అవార్డు(Kalinger Award) డీఎంకే కోశాధికారి, ఎంపీ బాలుకు విరుదునగర్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు.
Updated Date - 2022-09-03T15:19:21+05:30 IST