ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shashi Tharoor: మోదీకి ఇక్కడి కంటే బయట పార్లమెంట్లే మక్కువ

ABN, First Publish Date - 2022-08-09T21:38:27+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశ పార్లమెంటులో కంటే విదేశీ పార్లమెంట్లలోనే ఎక్కువగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశ పార్లమెంటులో (Indian parliament) కంటే విదేశీ పార్లమెంట్లలోనే (Foreign parliament) ఎక్కువగా మాట్లాడతారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)  అన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru),  ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) పనితీరు, (Working style) ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అశాంలపై ఇద్దరు ప్రధానుల మధ్య పోలికను ప్రస్తావించారు. మన ప్రధాని మోదీ విదేశీ పార్లమెంట్లలోనే ఎక్కువ ప్రసంగాలిస్తారని, ఇందుకు నెహ్రూ పూర్తిగా భిన్నమని అన్నారు.


ఇండియా-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ, ఆ సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటు సమావేశానికి పిలుపునిచ్చి, ఆ అంశంపై చర్చించారని, ఇవాళ అలా కాదని, ఇండియా-చైనా మధ్య సరిహద్దు అంశాలకు సబంధించిన ప్రశ్నలు లేవనెత్తడాన్ని కూడా అనుమతించడం లేదని విసుర్లు విసిరారు. గల్వాన్ లోయలో ఏమి జరిగిందని ప్రశ్నించారు. 21 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా దీనిపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చే జరగలేదని విమర్శించారు.


Updated Date - 2022-08-09T21:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising