ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే

ABN, First Publish Date - 2022-03-16T08:06:47+05:30

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 49శాతం మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ, మార్చి 15: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 49శాతం మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) వెల్లడించింది. ఇటీవల ఎన్నికలు ముగిసిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో గెలుపొందిన 690 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్‌ పరిశీలించింది. వీరి పరిశీలన ప్రకారం ఐదు రాష్ట్రాలనుంచి ఎన్నికైన 690మంది ఎమ్మెల్యేలలో 312మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది. అందులో 232మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం 312మంది నేరచరిత ఎమ్మెల్యేలలో బీజేపీనుంచి 134, సమాజ్‌వాదీపార్టీనుంచి 71, ఆమ్‌ఆద్మీపార్టీనుంచి 52, కాంగ్రె్‌సనుంచి 24, ఆర్‌ఎల్‌డీనుంచి ఏడుగురు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే యూపీ లో 51శాతం, పంజాబ్‌లో 50శాతం, ఉత్తరాఖండ్‌లో 27శాతం, మణిపూర్‌లో 23శాతం, గోవాలో 40శాతం ఎమ్మెలు నేరచరితులే. ఇక ఆస్తుల వివరాలకు వస్తే 690మందిలో 598మంది(87ు) కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. ప్రతి ఎమ్మెల్యే సరాసరి ఆస్తుల విలువ 8.7 కోట్లని వెల్లడించింది.

Updated Date - 2022-03-16T08:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising