ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మూడు ఆలయాల్లో నిత్యాన్నదానం

ABN, First Publish Date - 2022-07-03T12:49:12+05:30

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం రామనాథస్వామి, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి, మదురై మీనాక్షి అమ్మవారి దేవస్థానాల్లో రోజంతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - Minister Shekarbabu


అడయార్‌(చెన్నై), జూలై 2: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం రామనాథస్వామి, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి, మదురై మీనాక్షి అమ్మవారి దేవస్థానాల్లో రోజంతా అన్నదానం చేసే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని దేవాదాయ శాఖామంత్రి పి.శేఖర్‌బాబు తెలిపారు. నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2021-22లో అసెంబ్లీలో తమ శాఖ తరఫున ప్రకటించిన పథకాలకు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగం సమయంలో 165 ప్రకటనలు చేశామని, వాటిలో చాలామేరకు ఇప్పటికే అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు దేవాలయాల్లో రోజంతా అన్నదానం చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ పథకం విస్తరణ చర్యల్లో భాగంగా, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం, మదురై మీనాక్షి ఆలయాల్లో త్వరలోనే అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మరో పది ఆలయాల్లో అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నామని, ఈ పథకాన్ని ఈ ఏడాది మరో ఐదు ఆలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. 121 ఆలయాల్లో పెంచుతున్న గోవులను రూ.20 కోట్లతో సంరక్షిస్తామని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. 

Updated Date - 2022-07-03T12:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising