Minister: ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు
ABN, First Publish Date - 2022-09-15T14:42:01+05:30
నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా పలు చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్(Minister Durai Murugan) తెలిపారు.
- మంత్రి దురై మురుగన్
వేలూరు(చెన్నై), సెప్టెంబరు 14: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా పలు చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్(Minister Durai Murugan) తెలిపారు. కాట్పాడి నియోజకవర్గం బ్రహ్మపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేసే కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దురైమురుగన్ 200 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేలూరు కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ పథకంలో చేపడుతున్న పనులకు గత అన్నాడీఎంకే హయాంలోనే టెండర్లు ఆహ్వానించారన్నారు. పనుల్లో జాప్యం జరుగుతోందని బీజేపీ నిరసన చేస్తోందని, దానిపై అన్నాడీఎంకే నేతలను ప్రశ్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్, జిల్లా కలెక్టర్ కుమారవేల్ పాండ్యన్, మేయర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-15T14:42:01+05:30 IST