ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: మంత్రి అనితా రాధాకృష్ణన్‌కు షాక్‌

ABN, First Publish Date - 2022-09-18T13:12:21+05:30

అక్రమార్జన కేసులో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌(Minister Anita Radhakrishnan)కు షాక్‌ తగిలింది. ఆయనకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రూ.6.5 కోట్లు జప్తు చేసిన ఈడీ

- 2001-2006 నాటి కేసులో అధికారుల చర్యలు


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 17: అక్రమార్జన కేసులో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌(Minister Anita Radhakrishnan)కు షాక్‌ తగిలింది. ఆయనకు సంబంధించిన రూ.6.5 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) జప్తు చేసింది. అనితా రాధాకృష్ణన్‌ 2001 నుంచి 2006వ సంవత్సరం వరకు అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. జయ మంత్రివర్గంలో సభ్యుడైన ఆయన.. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగంతో ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రేగాయి. దీనిపై అప్పట్లోనే కేసు నమోదవ్వగా ఈడీ రంగంలోకి దిగింది. సుదీర్ఘకాలంగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో, శనివారం అనితా రాధాకృష్ణన్‌ కుటుంబానికి చెందిన రూ.6.5 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల్లో వున్న ఆస్తులను జప్తు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా వుండగా ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అనితా రాధాకృష్ణన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-18T13:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising