రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ విద్యార్థుల సైకిల్ ర్యాలీ
ABN, First Publish Date - 2022-04-17T13:23:42+05:30
బెంగళూరులోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఈ ఏడాది ప్లాటినం జూ బ్లీ వేడుకలను జరుపుకోనుంది. దీన్ని పురస్కరించుకుని ఈ స్కూల్కు చెందిన 13 మంది విద్యార్థులు, ఐదుగురు క్యాడెట్స్
అడయార్(చెన్నై): బెంగళూరులోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఈ ఏడాది ప్లాటినం జూ బ్లీ వేడుకలను జరుపుకోనుంది. దీన్ని పురస్కరించుకుని ఈ స్కూల్కు చెందిన 13 మంది విద్యార్థులు, ఐదుగురు క్యాడెట్స్ దేశ వ్యాప్త సైకిల్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. సైనిక పాఠశాలల్లో బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించాలని ఇటీవల కేంద్వ్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ శుక్రవారం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)కు చెందిన ఉన్నతాధికారులు ఈ ర్యాలీకి స్వాగతం పలికారు. రాత్రికి ఓటీఏలో బసచేసిన ఈ బృందం శనివారం మహాబలిపురం మీదుగా సైకిల్ ర్యాలీని ప్రారంభించింది.
Updated Date - 2022-04-17T13:23:42+05:30 IST