మెట్రోరైళ్లలో Mask తప్పనిసరి
ABN, First Publish Date - 2022-07-08T14:18:57+05:30
మెట్రోరైళ్లలో ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
పెరంబూర్(చెన్నై), జూలై 5: మెట్రోరైళ్లలో ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా, మళ్లీ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రకటించింది. ఈ క్రమంలో, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు తప్పకుండా మాస్క్ ధరించాలని సీఎంఆర్ఎల్ ప్రకటించింది.
Updated Date - 2022-07-08T14:18:57+05:30 IST