3న అమిత్షా బెంగళూరు పర్యటన
ABN, First Publish Date - 2022-04-30T18:20:11+05:30
కేంద్ర హోంమంత్రి అమిత్షా మే 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి
బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్షా మే 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి బయల్దేరిన సీఎం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఖేలో ఇండియా’ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అమిత్షాతో రాష్ట్ర రాజకీయ స్థితిగతులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని సీఎం స్పష్టం చేస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. తగిన సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలకు తనను ఢిల్లీకి ఆహ్వానిస్తామని అధిష్టానం పెద్దలు స్పష్టం చేశారన్నారు.
Updated Date - 2022-04-30T18:20:11+05:30 IST