సీఎం మమతాపై బీజేపీ ఎంపీ అర్జున్సింగ్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-03-17T15:40:56+05:30
బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...
West Bengalను పాకిస్థాన్గా మార్చేందుకు మమతాబెనర్జీ కుట్ర
అసన్సోల్: బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ను మరో పాకిస్థాన్గా మార్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుట్ర పన్నుతున్నారని భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు.అసన్సోల్లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో అర్జున్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మమతా బెనర్జీ ఎప్పుడూ బీహారీలకు వ్యతిరేకం. రాష్ట్రంలో పరిశ్రమలు పనిచేయకుండా మూతపడేలా చేశారు... బీహార్ ప్రజలు మాకు శ్రామికులను ఇచ్చారు’’ అని సింగ్ అన్నారు.
‘‘బెంగాల్లో ఏ పరిశ్రమ మూతపడినా, అందులో మమతా బెనర్జీ ప్రధాన పాత్ర పోషిస్తారు, తద్వారా రాష్ట్రం వెలుపల ఉన్న ప్రజలు నిరుద్యోగులుగా మారారు...సీఎం కారణంగా ముర్షిదాబాద్, మాల్డా, నదియా నుంచి 40 లక్షల మంది ప్రజలు బయట పని చేయాల్సి వస్తుంది.’’అని బీజేపీ ఎంపి అన్నారు.రాబోయే అసన్సోల్ లోక్సభ ఉప ఎన్నికలో అభ్యర్థిగా బీహార్కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్న సిన్హాను అధికార టీఎంసీ ప్రకటించింది.
Updated Date - 2022-03-17T15:40:56+05:30 IST