స్పృహ తప్పిన మంత్రి...ఐసీయూకు తరలింపు
ABN, First Publish Date - 2022-04-13T20:34:53+05:30
మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ధనంజయ్ ముండే ..
ముంబై: మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత ధనంజయ్ ముండే అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారంనాడు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆందోళన పడాల్సిన పనిలేదని, సాయంత్రానికి కల్లా ఆయనను ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పారు. ఆయనకు ఎలాంటి గుండెపోటు రాలేదని, స్పృహతప్పడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ముండే ఇటీవల రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. 2020 జూన్, 2021 మార్చిలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స అనంతరం కోలుకున్నారు.
Updated Date - 2022-04-13T20:34:53+05:30 IST