ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పృహ తప్పిన మంత్రి...ఐసీయూకు తరలింపు

ABN, First Publish Date - 2022-04-13T20:34:53+05:30

మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ధనంజయ్ ముండే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత ధనంజయ్ ముండే అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారంనాడు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆందోళన పడాల్సిన పనిలేదని, సాయంత్రానికి కల్లా ఆయనను ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పారు. ఆయనకు ఎలాంటి గుండెపోటు రాలేదని, స్పృహతప్పడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ముండే ఇటీవల రెండు సార్లు కరోనా  బారిన పడ్డారు. 2020 జూన్, 2021 మార్చిలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స అనంతరం కోలుకున్నారు.

Updated Date - 2022-04-13T20:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising